శ్రీమంతుడు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ బ్యానర్ గా సెట్టయిన మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ మరికొన్ని బారి చిత్రాలకు ప్లాన్ చేస్తోంది.మధ్య మధ్యలో కొన్ని అపజయాలు ఈ ప్రొడక్షన్ హౌస్ ని కాస్త ఇబ్బంది పెట్టినప్పటికి ఏ మాత్రం తగ్గకుండా అదే ఫ్లో ని కొనసాగిస్తోంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే.మైత్రి మూవీ మేకర్స్ లో ముగ్గురు స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కనున్నాయి.ఆ విషయంపై ఇటీవల సంస్థ ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు.శ్రీమంతుడు అనంతరం మహేష్ తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు.వచ్చే ఏడాది ఒక మంచి డైరెక్టర్ ని సెట్ చేసి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాను అక్టోబర్ లొనే స్టార్ట్ చేయనున్నారు.అలాగే ఎన్టీఆర్ సినిమాను కూడా వచ్చే ఏడాది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.ఎన్టీఆర్ సినిమాకు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నాడు.
అలాగే మరికొంత మంది కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది.మరి ఈ ప్రాజెక్టులతో ఏ స్థాయిలో విజయాల్ని అందుకుంటారో చూడాలి.