ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తెలుగు నుండి రిలీజ్ అయిన విషయం తెలిసిందే.అందులో ఒకటి మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య కాగా.
మరొకటి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా.ఈ రెండు సినిమాలు కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి.
రెండు ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కిన విషయం తెలిసిందే.
మరి ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏంటో తెలుసుగా.మైత్రి మూవీ మేకర్స్..ఈ నిర్మాణ సంస్థ ఈ మధ్య కాలంలో చాలా సినిమాల మీద పెట్టుబడులు పెడుతున్నారు.అలాగే ఆ సినిమాల నుండి లాభాలు కూడా పొందుతున్నారు.ఇటీవల కాలంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లైమ్ లైట్ లోకి వచ్చింది.వరుసగా సినిమాలు చేస్తూ టాప్ లోకి వచ్చేసింది.
మరి కొత్త ఏడాది మైత్రి మూవీ మేకర్స్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతుంది.ఏకంగా 3 వేల రుపాయలను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అయ్యిందట.ఆ నెక్స్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా చెప్పుకోవాల్సింది పుష్ప 2..ఈ సినిమా ఇప్పటికే పార్ట్ 1 రిలీజ్ అయ్యి సంచలనం క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు మరింత బడ్జెట్ తో పార్ట్ 2 నిర్మిస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్31 సినిమా కూడా నిర్మించనున్నారు.
అలాగే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాయి.ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నిర్మాణ సంస్థ మరో బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా మరో రెండు ప్రాజెక్టులను సెట్ చేసే పనిలో పడిందట.ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా మరో సినిమాను సెట్ చేసేందుకు సిద్ధం అవుతుంది అని టాక్ వినిపిస్తుంది.మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో వేచి చూడాల్సిందే.