ప్రస్తుతం ఉప్పెన సినిమా ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నాయి.చిరంజీవి మేనల్లుడు
వైష్ణవ్ తేజ్
, కృతి శెట్టి ఈ సినిమాకు తొలిసారిగా నటీనటులుగా పరిచయము కాగా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ సినిమాతోనే తొలిసారి దర్శకత్వంను అందించారు.
ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సినిమా నటీనటులకు భారీ కానుకలే అందుతున్నాయి.
ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి సముద్రపు ఒడ్డున కూర్చున్న ఓ ప్రేమజంట బొమ్మను గిఫ్ట్ గా ఇవ్వగా మరోసారి ఈ సినిమాలో నటించిన ఆశి- బేబమ్మ ( వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి) లకు మరో భారీ కానుక అందింది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా మంచి విజయం సాధించినందుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వైష్ణవ్ తేజ్ కు రూ.కోటి, కృతి శెట్టి కి రూ.25 లక్షలు కానుక ఇవ్వాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇదివరకే దర్శకుడు బుచ్చిబాబు సనా కు ఖరీదైన ఇళ్లు ని లేదా ఖరీదైన కారును బహుమతిగా మైత్రి మూవీ మేకర్స్ అందించాలానుకున్న వార్తలు వినిపించాయి.అంతేకాకుండా సినీ బృందం లో పాల్గొన్న సభ్యులకు కూడా బహుమతులను ఇవ్వాలనుకున్నట్లు తెలుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే భారీ బడ్జెట్ ను పొందగా ఇప్పటికీ థియేటర్ లలో ఈ సినిమా జోరుగా సాగుతోంది.ఇక ఈ సినిమాతో పరిచయమైన వైష్ణవి తేజ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక వైష్ణవ తేజ్ కు ఈ సినిమాతోనే తొలిసారి గుర్తింపు రాగా మరో అవకాశాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.