నల్గొండ జిల్లాలో ఓ మిస్టరీ డ్రోన్ కలకలం చెలరేగింది.శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామ సమీపంలో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ కూలింది.
పంట పొలాల్లో పడిన డ్రోన్ను గమనించిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ను శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా ఈ డ్రోన్ లో జీపీఎస్ చిప్, ఎయిర్ టెల్ సిమ్ తో పాటు ఓ కెమెరాను గుర్తించారు.డ్రోన్ ను ఎవరు ఉపయోగించారు.? ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.