హైదరాబాద్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ హుస్సైన్ సాగర్ గురించి తప్పక తెలుస్తుంది.అయితే అందరికి సుపరిచితం అయితే ఈ సాగర్ గురించి రాజధాని వేదికగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి…కారణాలు ఏమైనా….అప్పటి వారుక్ చెబుతున్న మాటల ప్రకారం…హుస్సేన్సాగర్లో నాలుగు తరాల రాగి, బంగారు, వెండి, నాణేలు దొరుకుతాయని తెలుస్తుంది.వంటపాత్రలు….అప్పట్లో వంటలకు వినియోగించిన పాత్ర లు బయటపడుతాయన్న చర్చ కొసాగుతోంది.రాగి, ఇత్తడి, కంచు, మట్టి పాత్రలు బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.మహిళలు వస్త్రధారణకోసం వినియోగించిన ఆభరణాలు దొరుకుతాయని చెబుతున్నారు.పోలీస్ యాక్షన్ సమయంలో…హైదరాబాద్ మహానగర చరిత్రలో పోలీస్ యాక్షన్ ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం చేసే క్రమంలో చాలా మంది విలువైన వస్తువులను సాగర్లో వేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక చరిత్రకారులు చెప్పింది చూస్తే.
సాగర్ లో పాతకాలం సామగ్రి, బొమ్మలు, చిత్రపటాలు, కళాకృతులు బయటపడతాయన్న ఆలోచనలు ఉన్నాయి.ఇంకెముంది పురావస్తు శాఖ వారికి పనే పని.