ఆ గ్రామంలో ప్రజలు వణికి పోతున్నారు.వరుస మరణాలతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
పెద్దలు, పిల్లలు అనే లేకుండా వరుసగా మరణిస్తున్నారు.ఏ వ్యాధితో చనిపోతున్నారో కూడా తెలియడం లేదు.
అందుకే మిగతా ప్రజలకు కూడా భయం పట్టుకుంది.ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలియక ఆ గ్రామంలో ఉండా లంటేనే భయ పడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇంతకీ ఏంటా గ్రామం.అసలు ఏం జరుగుతుందో వివరాలు తెలియాలంటే అసలు మ్యాటర్ తెలుసుకోవాల్సిందే. తూర్పు గోదావరి జిల్లా పులిపాక గ్రామంలో జరుగుతున్న వింత సంఘటనతో అక్కడి ప్రజలు ఉలిక్కి పడుతున్నారు.ఆ గ్రామంలో వరుసగా మరణాలు సబావిస్తుండడంతో ఏ వ్యాధితో చనిపోతున్నారో కూడా తెలియడం లేదు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చనిపోతున్నారు.
బ్రతికుంటే ఎక్కడైనా హాయిగా ఉండవచ్చు అని ఆ గ్రామం విడిచి వెళ్లి పోతున్నారు.గత కొద్దీ రోజులుగా వింత వ్యాధితో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మరణిస్తున్నారు.ఇప్పటికే మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుండడం తో ఆ గ్రామంలో ఉండే ప్రజలు భయపడుతున్నారు.
అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.ఈ విషయంపై మీడియాలో వరుస కథనాలు కూడా వస్తున్నాయి.
అందుకే ప్రజలు వారి సొంత గ్రామాన్ని కూడా విడిచి వెళ్లాలని అనుకుంటున్నారు.మరి అసలు ఈ వింత వ్యాధి ఏమిటో తెలుసుకుని అసలు దీనికి పరిష్కారం ఏమిటో అలోచించి అధికారులు వెంటనే స్పందించి వైద్యం అందేలా చేయాలనీ గ్రామంలో ఉన్న ప్రజలు కోరుతున్నారు.మరి ఈ వింత వ్యాధి ఏమిటో వైద్యులు ద్వారా అధికారులు తెలుసుకుని వెంటనే వైద్యం అందిస్తారో లేదో చూడాలి.లేకపోతే ఆ గ్రామం ముందుముందు కాళీ అయి పోతుంది.