ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి.ఈమె ఉప్పెన ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమా విజయవంతం కావడంతో తనకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం కృతి శెట్టి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా నటిస్తున్నారు.
ఈ విధంగా ద్విభాషా చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న కృతి శెట్టి తాజాగా నితిన్ తో కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో రానుంది.ఇక ఇందులో తన పాత చాలా సింపుల్ గా ఎంతో ఇన్నోసెంట్ గా ఉంటుందని సందర్భాన్ని బట్టి తన క్యారెక్టర్ మారుతూ ఉంటుందనే సీక్రెట్ బేబమ్మ బయట పెట్టారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
తన జీవితంలో సినిమాలో కాకుండా మరి ఏదైనా జీవిత లక్ష్యం ఉందా అని ప్రశ్నించగా…అందుకు కృతి శెట్టి సమాధానం చెబుతూ తనకు సినిమాలు కాకుండా తన జీవితంలో ఎప్పటికైనా ఒక ఎన్జీవో సంస్థను స్థాపించాలన్నది తన లక్ష్యమని, త్వరలోనే ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఈమె తన జీవితం గురించి బయట పెట్టారు.అదేవిధంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి ప్రశ్నించగా ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని కృతి శెట్టి వెల్లడించారు.ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.