తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానంటూ వై.ఎస్.షర్మిల చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖపోరే తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న తరుణంలో షర్మిల పార్టీ రాజకీయ రణరంగాన్ని మరింత రసవత్తరంగా మార్చనుంది.
ఇప్పటివరకు పార్టీ విధి, విధానాలు ఏమీ ప్రకటించకపోయినా పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.అయితే ఇప్పటికే రాజకీయపరమైన వ్యాఖ్యలను చేస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.గిరిజన తండాల బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించాలని, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.షర్మిల కోరారు.ఇక నా మద్దతు గిరిజనులకు ఉంటుందని వై.ఎస్.షర్మిల ప్రకటించారు.అయితే ఇప్పటికే గిరిజనులకు సంబంధించిన పోడు భూముల సమస్య పెండింగ్ లోనే ఉంది.
ప్రభుత్వం పరిష్కరిస్తామని పలు మార్లు చెప్పినప్పటికీ, ఆ హామీ అమలు దిశగా ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గిరిజనులకు నా మద్దతు ఉంటుందని ప్రకటించిన వై.ఎస్.షర్మిల పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గల మెత్తుతుందో లేదో చూడాల్సి ఉంది.