పార్టీలోకి ఎవరైనా పెద్ద తలకాయ వస్తానంటే ఏ పార్టీ అయినా ఎదురెళ్లి మరీ స్వాగతం పలుకుతారు.అసలే రాజకీయాల్లో ఓనమాలు తెలియని జనసేన పార్టీకి రాజకీయ ఉద్దండుల అవసరం ఎంతయినా ఉంది.
అయితే కొద్దీ రోజులుగా కడప జిల్లాకు చెందిన సీనియర్ పొలిటికల్ లీడర్ ఎంవీ మైసూరా రెడ్డి జనసేనలోకి వస్తున్నట్టుగా వార్తలు గుప్పు గుప్పుమంటున్నాయి.కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత టీడీపీలో చేరి మరల వైసీపీలోకి వెళ్లి వై పార్టీలోనూ ఎక్కువ నిలబడలేక ఆఖరికి రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్నాడు.
ఈ దశల ఆయనకు జనసేన ఒక్కటే పెద్ద దిక్కుగా ఇప్పుడు కనిపిస్తోంది.పార్టీలో చేరాల్సిందిగా పవన్ ఇతడిని ఆహ్వానించాడో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం జనసేన కు సపోర్ట్ గా మాట్లాడుతుండడం చూస్తుంటే త్వరలోనే ఆయన పార్టీలో చేరబోతున్నట్టుగా అర్ధం అవుతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా .ఇప్పుడు జనసేన కార్యకర్తలకు ఒక భయం పట్టుకుంది.రాబోయే ప్రభుత్వం తమదే అంటూ ప్రచారం చేసుకుంటోన్న జనసైనికులకు మాత్రం ఈ విషయం అస్సలు మింగుడు పడడం లేదు.టిడిపి అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్ కు వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటపుడు టిడిపిలోకి వెళ్లి, టిడిపి పగ్గాలు చేపట్టినపుడు వైసీపీలోకి జంప్ అయిన మైసూరారెడ్డి, ఇప్పుడు జనసేనలోకి ఎంట్రీ ఇస్తే జనసేన పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన జనసేన పార్టీలో బలంగా నాటుకుపోయింది.
అయితే పవన్ ఆయన రేఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో అనే విషయం మతం ఎవరికీ క్లారిటీ లేదు.
గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటోన్న ఈ సీనియర్ పొలిటిషియన్, జనసేనకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలే ఈ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేసాయి.
ఏపీ రాజకీయాలలో జనసేన సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని, కాపులు రాజ్యమేలే సంకేతాలు కనపడుతున్నాయని చెప్పడంతో మైసూరా జనసేనలోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి.మరో పది, పదిహేను రోజుల్లో మైసూరా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
మైసూరా చేరితే సీమలో జనసేన బలం పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది.కానీ మైసూరా ఆ పార్టీలో ఇమడగలడా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం మైసూరా ఐరన్ లెగ్ అనే వార్తలు జనసేన నుంచే వినిపిస్తుండడంతో పవన్ ముందడుగు వేస్తాడా వెనకడుగు వేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.