ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం మాంసం ధరలపై అధిక ప్రభావాన్ని చూపుతోందంటున్నారు దుకాణ దారులు.అదీగాక సంక్రాంతి పండగ రావడంతో మాంసం వినియోగించే వారు అధికం అవడంతో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయట.
అయితే బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా మటన్ రేటు మాత్రం ఊహించని స్దాయికి చేరుకుంటుందంటున్నారు.బర్డ్ఫ్లూ నేపధ్యంలో చికెన్ కొనేందుకు జంకుతున్న వారంతా మటన్ వైపు మళ్లుతున్నారు.
దీంతో కొందరు వ్యాపారులు ఇప్పటికే ధరలు పెంచేయగా, మరి కొందరు కూడా అదే బాట పట్టారట.
ఇక గత కొన్ని రోజుల క్రిత్రం నుండి మటన్ ధర కిలో కు 650 నుండి 700 రూపాయలు ఉండగా ప్రస్తుత పరిస్దితుల్లో ఏకంగా కిలో 900 నుండి 1000 రూపాయల వరకు వ్యాపారులు పెంచేశారట.
ఇక చేపల ధరలు కూడా భారీగానే పెరిగాయట.ఏది ఏమైన అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మన వ్యాపారులకు బాగా అలవాటైందని అనుకుంటున్నారట మాంసం తినే వినియోగదారులు.