లెజెండరీ స్పిన్నర్, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు అయిన ముత్తయ్య మురళీధరన్ కి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నై నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది వారు మురళీధరన్ కి అంగీయోప్లాస్టీ చికిత్స చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం మురళీధరన్ ఐపీఎల్ 2021 కోసం ఇండియాకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఐపీఎల్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ కోచ్ గా మురళీధరన్ వ్యవహరిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం చెన్నై లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తుండగా బౌలింగ్ కోచ్ గా ఉన్న ముత్తయ్య మురళీధరన్ కొన్ని రోజుల క్రితమే టీమ్ మొత్తంతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం మనం చూశాం.ఇక ప్రస్తుతం మురళీధరన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టంగా తెలియచేస్తున్నారు.
ఇలా ఉండగా మరోవైపు ఆరెంజ్ ఆర్మీ ముత్తయ్య మురళీధరన్ అతి త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును కలుస్తారని ఆరెంజ్ ఆర్మీ సభ్యులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.ఇక మురళీధరన్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో 1300 పైగా వికెట్లు తీయగా, కేవలం టెస్ట్ మ్యాచ్ లలో 800 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.