దంతాలు తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటే చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దంతాలు తెల్లగా ఉంటే వారి నవ్వు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది.
కానీ, కొందరి దంతాలు ఎంత తోముకున్నా పసుపు పచ్చగానే ఉంటాయి.ఇలాంటి వారు తరచూ టూత్ పేస్ట్లను మారుస్తూ దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే న్యాచురల్గా కొన్ని టిప్స్ను పాటిస్తే సులభంగా పసుపు పచ్చని దంతాలను వదిలించుకోవచ్చు.
ముఖ్యంగా అందుకు ఆవ నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
మరి దంతాలకు ఆవ నూనె ఎలా యూజ్ చేయాలో చూసేయండి.ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ ఆవ నూనె, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసుకుని రెండు, మూడు నిమిషాల పాటు రుద్దుకోవాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే క్రమంగా దంతాలు తెల్లగా మారతాయి.
అలాగే నిమ్మ తొక్కలు కూడా దంతాలను మెరిపించగలదు.
నిమ్మ తొక్కలను ఎండ బెట్టుకుని పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల పొడిలో సరి పడా నీటిని వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంతో దంతాలను రుద్దుకుని మామూలు నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఈ టిప్స్తో పాటు రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవాలి.మౌత్ వాష్, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఎందుకంటే, ఇవి దంతాలను పసుపు వర్ణంలోకి మార్చేస్తాయి.అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.రెగ్యులర్ డైట్లో సిట్రస్ పండ్లు ఉండేలా చూసుకోండి.సిట్రస్ పండ్లు దంతాల మీద ఎటువంటి పసుపు మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి.