2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ కాంతార సినిమాకు ప్రత్యేక స్థానం ఉందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా బడ్జెట్ కు కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదు.16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 400 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం అంటే సాధారణ రికార్డ్ కాదు.శాటిలైట్, డిజిటల్ హక్కులు అదనం కాగా ఈ హక్కుల ద్వారా నిర్మాతలకు భారీ మొత్తంలో ఆదాయం చేకూరనుంది.
అయితే కాంతార మూవీ చూడొద్దంటూ ముస్లిం జంటపై దాడి జరగగా ఈ దాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.కర్ణాటక రాష్ట్రంలోని సుల్యా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
సుల్యాలోని సంతోష్ థియేటర్లో ప్రస్తుతం కాంతార మూవీ ప్రదర్శితమవుతోంది.ఒక ముస్లిం జంట ఈ థియేటర్ లో కాంతార మూవీ చూడటానికి వెళ్లగా కొంతమంది ముస్లిం యువకులు సినిమా చూడొద్దంటూ ఆ జంటను భయపెట్టారు.
ముస్లిం యువకులు భయపెట్టడంతో ఆ ముస్లిం జంట అక్కడినుంచి వెళ్లిపోయింది.
సంతోష్ థియేటర్ ఓనర్ ముస్లిం జంటను బెదిరించిన యువకుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.సినిమా చూడొద్దంటూ బెదిరించడం, దాడి చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో కాంతార మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్ల నుంచి వచ్చిన స్థాయిలో ఓటీటీల నుంచి రెస్పాన్స్ రాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.వరాహరూపం సాంగ్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.అయితే త్వరలో ఈ సాంగ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కాంతార మూవీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.