క్రియేటివ్ డైరెక్టర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తు్న్నాడు.ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన, ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న కృష్ణవంశీ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్లోకి రావాలని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం భారీ తారాగణంను ఎంచుకున్న కృష్ణవంశీ, సంగీతం అందించేందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను ఎంచుకున్నాడు.
ఇక సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనుల్లో ఇళయరాజాతో కలిసి బిజీగా మారిపోయారు.తాజాగా చెన్నైలో కృష్ణవంశీ, ఇళయరాజాలు ఈ సినిమా సంగీతం కోసం సిట్టింగు వేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.