సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో సినీ తారలు సందడి చేయడం కొత్తేమి కాదు.అయితే ఈ సంస్కృతి తెలుగులో కన్నా హిందీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ విధంగా బుల్లితెరపై వెండితెర తారలు సందడి చేయడంతో ఆ సీరియల్ కి హైప్ క్రియేట్ కావడమే కాకుండా.వారికి కూడా పబ్లిసిటీ వస్తుంది.
ఈ క్రమంలోనే చాలామంది వెండితెర తారలు బుల్లితెరపై తళుక్కుమంటున్నారు.
ప్రస్తుతం హిందీ సీరియల్స్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఇలాంటి గెస్ట్ అప్పియరెన్స్ లు తెలుగులో కూడా ఇదే పద్ధతిని అనుసరించబోతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమయ్యే “కృష్ణ తులసి” సీరియల్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ సందడి చేయబోతున్నారు.తాజాగా పాటలక్క కోసం ఆర్ పి పట్నాయక్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆర్.పి పట్నాయక్ కనిపించబోయే సన్నివేశంతో కూడిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల నుంచి విశేష స్పందన దక్కించుకుంది.ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం బుల్లితెరలో సరికొత్తగా ప్రసారం కాబోతున్న “ముత్యమంతా ముద్దు” అనే సీరియల్ కోసం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా బుల్లితెరపై గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం వల్ల వారికి పబ్లిసిటీ రావడమే కాకుండా… సీరియల్ కి కూడా బాగా రేటింగ్స్ పెరుగుతాయని చెప్పవచ్చు.