మెసేజ్ తో కూడిన సినిమాలకు కమర్షియల్ అంశాలను జత చేసి ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు దర్శకుడు శంకర్.జెంటిల్ మేన్, ఒకేఒక్కడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శంకర్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తరువాత చాలామంది దర్శకుల పేర్లు వినిపించగా చివరకు శంకర్ డైరెక్షన్ లో చరణ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. శంకర్ డైరెక్షన్ లో నటిస్తూ రామ్ చరణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేస్తుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా ఏ ఆర్ రెహమాన్ కు తెలుగు సినిమాకు ఎప్పుడు సంగీతం అందిస్తారని ప్రశ్నించగా త్వరలోనే అని రెహమాన్ సమాధానం ఇచ్చారు.
త్వరలో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ లలో శంకర్ చరణ్ ప్రాజెక్ట్ ఒకటి కావడం, శంకర్ సినిమాలలో ఎక్కువ సినిమాలకు ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఈ సినిమాకే ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు ఈ సినిమా కోసం స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తే ఆ మాటలు సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్, కియారా అద్వానీ, కొరియా నటి సుజీబే పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ హీరోయిన్లలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది.కియారా అద్వానీనే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.