టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది.కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలుకాలేదు.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లో మనకు కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకపోయినా, ప్రేక్షకులను మెప్పించే అంశం మాత్రం ఆగడం లేదని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.దీనికి సంబంధించి థమన్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.
మహేష్ లాంటి సూపర్ స్టార్ కోసం అదిరిపోయే ట్యూన్స్ వస్తున్నాయని, అవి ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని థమన్ ఈ సందర్భంగా తెలిపాడు.ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
గీతాగోవిందం చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్న పరశురామ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవల అల వైకుంఠపురములో చిత్రానికి కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించిన థమన్, సర్కారు వారి పాట కోసం ఎలాంటి సంగీతాన్ని అందిస్తున్నాడో తెలియాలంటే ఈ సినిమా పాటలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.