పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్, ఇండియా సరిహద్దు దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది.రెండు దేశాలు తమ భారీ బలగాలని, సరిహద్దు వెంబడి మొహరించి ఉంచాయి.
అలాగే ఆయుధాలని కూడా సరిహద్దులుకి తరలించే పనిలో భారత్ వుంది.సరిహద్దు గ్రామాలలో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించి అక్కడ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం అన్నట్లు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా వుంది.
మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా బారత్ యుద్ధం చేయడానికి రెడీ అయ్యేలా వుందని భావిస్తుంది.ఈ నేపధ్యంలో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక పాకిస్తాన్ ప్రజలలో కూడా యుద్ధం భయం మొదలైంది.
ఇదిలా వుంటే ఒక వేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ కి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ దేశ ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే అంతంత బ్రతుకులతో ఎప్పుడు ఎక్కడ టెర్రరిస్ట్ లు బాంబ్స్ వేస్తారో, ఎలా ప్రాణాలు పోతాయో తెలియని స్థితిలో వున్న పాకిస్తాన్ ప్రజలు ఈ యుద్ధం వలన దారుణంగా దెబ్బ తినే అవకాశం వుందని తెలుస్తుంది.ఇప్పటికే పాకిస్తాన్ కి భారత్ నుంచి ఎగుమతులు, జల వనరులని ఆపేసిన భారత్ ప్రపంచ దేశాల ఆర్ధిక సాయం కూడా అందకుండా చేస్తుంది.
ఈ నేపధ్యంలో యుద్ధం వస్తే పాకిస్తాన్ ఒక్క అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులు వేసి పాకిస్తాన్ పని ముగించేస్తుంది అనే పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్, ముషారఫ్ కీలక వాఖ్యలు చేసారు.