అగ్ర రాజ్యం అమెరికాలో ప్రతీ రోజు ఏదో ఒక మూలన తుపాకి పేలుళ్ల ఘటనలు వినిపిస్తూనే ఉంటాయి.ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.
గడిచిన కొన్ని నెలల కాలంలో ఎన్నో సంఘటనలు ఎంతో మంది అమాయకులను బలి తీసుకున్నాయి.రెండు వారాల క్రితం ఓ స్కూల్ లో జరిగిన తుపాకి దాడి ఘటనలో సుమారు 19 మంది పిల్లలు మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.
అయితే తాజాగా అమెరికాలో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.పధకం ప్రకారం ప్లాన్ చేసుకున్న దుండగులు ఓ భారతీయుడిపై కాల్పులు జరిపారు…అసలేం జరిగిందంటే.
అమెరికాలోని ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న భారత సంతతి సిక్కు కమ్యూనిటీ కి చెందిన సత్నం సింగ్ అతడు నివాసం ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న సౌత్ జోన్ పార్క్ కు సరదాగా వెళ్ళాడు.అంతకు ముందు తాను అద్దెకి తెచ్చుకున్న బ్లాక్ జీప్ తో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అతడిని సేఫ్ గా దించిన తరువాత పార్క్ లో సేద తీరేందుకు వచ్చాడు.
సత్నం సింగ్ పార్క్ లో కూర్చిని ఉన్న సమయంలో వెనుక నుంచీ ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.అసలేం జరుగుతుందో తెలుసుకునే లోగానే సత్నం స్పృహ కోల్పోవడంతో ఆ దుండగుడు అక్కడి నుంచీ పారిపోయాడు.
ఈ ఘటన పై సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేపట్టారు.ప్రాణాలతో ఉన్న సత్నం సింగ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడించారు.అంతేకాదు వాళ్ళు చెప్పిన విషయాలు విని ఈ భారతీయుడు ఎంత దురదృష్ట వంతుడోనని అనిపిస్తుంది.సత్నం ను టార్గెట్ గా దుండగులు దాడి చేయలేదని అతడు తీసుకువచ్చిన కారు యజమా
.