ఢిల్లీలోని తీహార్ జైలు లో చోటుచేసుకున్న ఘటన గురించి విన్నారు అంటే సినిమాలు గుర్తుకు రాకుండా మానవు.నిజంగా సినిమాలను తలపించే రేంజ్ లో తీహార్ జైలు లో ఒక హత్యాఘటన చోటుచేసుకుంది.
రోజూ ఉదయాన్నే ఖైదీలందర్నీ ప్రార్థనల కోసం పోలీసులు పంపించిన సమయంలో ఒక ఖైదీ తోటి ఖైదీ ని దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.అరుపులు వినిపించడం తో పోలీసులు వెళ్లి చూసేసరికి… 27 ఏళ్ల మహమూద్ మెహతాబ్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు.
పక్కనే 21 ఏళ్ల మరో ఖైదీ నిరంజన్ (పేరు మార్చాం) చేతిలో రక్తపు చుక్కలు కారుతున్న కత్తి కనిపించింది.అతనే హత్య చేశాడని పోలీసులకు అర్థమైంది.
దీనితో వెంటనే కత్తిని స్వాధీనం చేసుకొని మహతాబ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు.ఆ తర్వాత కత్తితో పొడిచిన నిరంజన్ని… ప్రత్యేక గదిలో ఉంచి ఇంటరాగేషన్ చేయగా అసలు విషయం వెల్లడైంది.
ఎందుకు ఇలా చేసావు అంటూ పోలీసులు ప్రశ్నించడం తో అతడిపై పగ ఉందని ఇప్పుడు ఆ పగ తీర్చుకున్నా అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు.ఇంతకీ ఆ పగ ఏంటి అని ఆరా తీయగా, ఇప్పుడు చనిపోయిన మహతాబ్… 2014లో నిరంజన్ అక్కని రేప్ చేశాడు.
అయితే అప్పుడు ఆమె మైనర్ కావడం తో తనకు జరిగిన అన్యాయాన్ని తన తమ్ముడికి చెప్పుకొని ఏడ్చేసింది.ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.దానితో అప్పట్లోనే మైనరైన నిరంజన్ మెహతాబ్పై పగ పెంచుకుని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు.కానీ… మెహతాబ్ రేప్ కేసులో అరెస్టై జైల్లో ఉండడం తో ఏమి చేయాలో అర్ధం కాలేదు.ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా అతడిపై పెంచుకున్న పగ మాత్రం తగ్గలేదు.దీనితో 2018లో నిరంజన్ కావాలనే ఓ మర్డర్ చేసి తద్వారా జైలుకెళ్లాడు.అయితే తీహార్ జైలుకి వెళ్లిన అతడు తన శత్రువు ఎక్కడ ఉన్నాడా అని గమనించి అతడి సెల్ కు వెళ్ళడానికి మరో ప్లాన్ వేసుకున్నాడు.
వేరే సెల్ నెంబర్ లో ఉన్న తన శత్రువును కలవడం కోసం అని తన సెల్ లో ఉన్న తోటి ఖైదీతో గొడవపెట్టుకొని చితకబాదాడు.దాంత.ఆ బాధిత ఖైదీ నిరంజన్ చాలా క్రూరుడు అతడిని మెహతాబ్ ఉన్న సెల్ నెంబర్ కు పంపించండి ప్లీజ్ అంటూ బతిమాలుకొనేలా ప్లాన్ చేశాడు.
అసలే హత్య చేసి జైలుకి రావడంతో సహజంగానే పోలీసులు అతన్ని క్రూరుడిగా అనుమానించి,తీవ్ర ఖైదీగా గుర్తిస్తూ మెహతాబ్ ఉంటున్న జైలు నంబర్ కిపంపారు.అక్కడ తన శత్రువుని చూసిన నిరంజన్… “ఎస్ దొరికాడు” అనుకొని ఎప్పుడు వస్తుందా అవకాశం అని ప్లాన్ చేసుకుంటూ ఒక కత్తిని కూడా సంపాదించుకున్నాడు.
సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది సోమవారం నాడు అందరూ ఉదయాన్నే ప్రార్థనలకు వెళ్లినప్పుడు,అదే అదునుగా చూసుకొని మెహతాబ్ని వరుసగా కసాకసా పొడిచాడు.దాంతో మెహతాబ్ చనిపోయాడు.
అలా తన అక్కను రేప్ చేసిన మెహతాబ్ ని మట్టుబెట్టాడు.ఈ కధ మొత్తం పోలీసులకు చెప్పడం తో వారు ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారు.
ఇక చేసేదేమి లేక నిరంజన్ ను మరో సెల్ కి పంపించారు.నిజంగా ఈ ఘటన వింటే మాత్రం సినిమా రేంజ్ లో ఉందికదా.
అక్క కు అన్యాయం చేసిన వాడిని మట్టుపెట్టడం కోసం ప్లాన్ లు మీద ప్లాన్ లు వేసుకుంటూ చివరికి అతడిని కసితీరా చంపి తాను పెంచుకున్న పగను తీర్చుకున్నాడు.