దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.ఈ ఘటనకు కారణమైన నలుగురు వ్యక్తులు పోలీసులకు దొరకగానే వారి మీద ప్రజలు కూడా అదే స్థాయిలో ఆగ్రహం చూపించారు.
వారిని పోలీస్టేషన్ నుంచి జైలుకి తరలించే సమయంలో వారిమీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు.ఇది ఇలా ఉండగానే నిందితులు నలుగురిని జ్యూడిషియల్ రిమాండ్ లో ఉండగానే పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లడం ఆ తరవాత వారు పోలీసుల మీద దాడి చేయడం ఆ సందర్భంగా ఆ నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం జరిగిపోయాయి.
అయితే ఈ ఎన్కౌంటర్ పై హైదరాబాద్ నగరానికి చెందిన ‘నేను సైతం’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తోపాటు మరో నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డి ప్రవీణ్ కుమార్ ఉప్పల్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో కోరారు.
అయితే ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.