ఎంఐఎంను మ్యూజియంలో పెట్టే రోజు వస్తుంది

తెలంగాణ వ్యాప్తంగా నేడు బీజేపీ విమోచన దినోత్సవం నిర్వహించింది.ఈ సందర్బంగా హైదరాబాద్‌ పటాన్‌ చెరువులో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 Muralidhar Rao Commentson Kcr And Majlis Party-TeluguStop.com

బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌ రావు ఈ సందర్బంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.కేసీఆర్‌ మజ్లీస్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మజ్లీస్‌ పార్టీని చూసి కేసీఆర్‌ భయపడుతున్నాడు అంటూ మురళిధర్‌ రావు పేర్కొన్నారు.

తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించకుండా కేసీఆర్‌ రాజకీయం చేశాడని, ఆయన ఓటు బ్యాంకు కోసం ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ మండి పడ్డాడు.

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మజ్లీస్‌ పార్టీని మ్యూజియంలో పెట్టేస్తామంటూ వ్యాఖ్యలు చేశాడు.మజ్లీస్‌ పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం నడుపుతున్నట్లుగా మురళిధర్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube