తెలంగాణలో కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మాత్రం మొత్తానికి అనుకున్నది సాధించింది.వరుసగా ఎన్నికలను జరిపిస్తూ ఎట్టకేలకు రాష్ట్రంలో జరుగుతున్న మినీ పురపోరు తుది అంకానికి చేర్చింది.
కాగా ఈ మినీ పురపోరులో 1307 మంది బరిలో ఉన్నారు.ఇకపోతే నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఇక రాష్ట్రం లోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తో పాటుగా సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లోని 248 వార్డులకు ఎన్నికలు జరగున్నాయి.
వీటితో పాటుగా గజ్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డు, బోధన్ మున్సిపాలిటీ 18వార్డు, నల్గొండ మున్సిపాలిటీ 26వ వార్డు, పరకాల మున్సిపాలిటీ 9వార్డుతో పాటుగా జీహెచ్ఎంసీలోని లింగోజీగూడ 18వ డివిజన్కు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే వీటి ఫలితాలను మే 3వ తేదీన వెల్లడించనున్నామని అధికారులు వెల్లడించారు.