గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో తాడేపల్లి పట్టణం 13, 14వ సచివాలయాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీ.ఎస్ శ్రీ లక్ష్మీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
శ్రీలక్ష్మితో పాటు ఈ తనిఖీలలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ కమీషనర్ యూ.శారదా దేవి పాల్గొన్నారు.
పట్టణం లో పద్మశాలీయ నగర్ మార్కెట్ సెంటర్ లో ఉన్న 13వ సచివాలయం, ఉండవల్లి సెంటర్ లో ఉన్న 14వ సచివాలయాలను గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ రెండు సచివాలయాల లో రికార్డులు, ఉద్యోగుల హాజరు సమయాలు పరిశీలన చేయడం జరిగింది.
రెండు సచివాలయాల పరిధిలో స్థానిక ప్రజలతో శ్రీ లక్ష్మి ప్రత్యక్ష ముఖాముఖి అయ్యారు.
సచివాలయాల పనితీరు, ఉద్యోగుల సేవలు పై ప్రజల నుండి ఆరా తీసారు.
సచివాలయ వ్యవస్థపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.స్థానిక ప్రజలతో ముఖా ముఖి అనంతరం సచివాలయాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తామని శ్రీలక్ష్మి స్ధానికులతో అన్నారు.
సచివాలయ సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పదకాలలో ప్రధానంగా విద్య, మధ్యాహ్న భోజన పథకం, మహిళా శిశు సంక్షేమం, వంటి పథకాలపై సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారికి సూచించారు.

అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.ఆలాగే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు పిల్లలెవరూ బడి బయట లేరని నిర్ధారించడానికి, బడి బయట ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి ప్రేరేపించాలని తెలిపారు.సచివాలయ సిబ్బంది ప్రజలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో రశీదులను ధృవీకరించి, మున్సిపాలిటీకి, సెక్రటేరి యట్లలో వసూలు చేసిన మొత్తాలను జమ చేయాలని ఆదేశించారు.వాలంటీర్లతో మమేకమై సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు.
రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా మొదలైన వాటి యొక్క మాస్టర్ డేటాను నిర్వహించాలని, అలాగే గుంతలను గుర్తించాలని, నీటి నాణ్యతను నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయాలని వార్డు సౌకర్యాల కార్యదర్శులకు సూచించారు.