బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే.అయితే ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ ఇంటిలో ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడం తో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
దీనితో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయిందని ముంబై పోలీసులు కూడా చాలా విధాలుగా ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ఇంట్లో పని చేసే వాళ్లను.
ఆయన స్నేహితులను.గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా విచారించినట్లు తెలుస్తుంది. రియాను అయితే ఏకంగా 11 గంటల పాటు ముంబై పోలీసులు ప్రశ్నించారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినపుడు ఆయన ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం కి తోడు సూసైడ్ నోట్ కూడా లభించక పోవడం తో ఈ కేసు విచారణ అలానే ఉండిపోయింది.
అయితే తాజాగా సుశాంత్ కు చెందిన డైరీ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.రెండేళ్ల కింద ముంబైలో 20 కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొన్నాడు సుశాంత్.
ఇందులో ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలను ముంబై పోలీసులు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అలానే సుశాంత్ కు డైరీ రాసే అలవాటు ఉందని,అలా 4,5 డైరీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ ఈ డైరీలు కానీ చదివితే అందులో మరిన్ని విషయాలు తెలుస్తాయని.
అప్పుడు ఈ నటుడు ఎందుకు చనిపోయాడనేది క్లూ దొరుకుతుందనేది ఆలోచిస్తున్నారు ముంబై పోలీసులు.
సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది.సుశాంత్ మరణం తో అటు అభిమానులు,కొందరు సినీ ప్రముఖులు నెపోటిజం పై చర్చించుకుంటున్నారు.
బాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీ ల వల్లే సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.