సాధారణంగా సినిమా హీరోయిన్లకు, సీరియల్ హీరోయిన్లకు సంపాదన భారీగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఇద్దరు సీరియల్ హీరోయిన్లు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక క్రైమ్ షో చేయడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న సురభి సుందర్ లాల్, ముక్తర్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.క్రైమ్ పెట్రోల్ అనే టీవీ షోతో పాటు సావ్ ధాన్ ఇండియాలో నటించి ఈ సీరియల్ యాక్టర్లు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ముక్తర్, సురభి రాయల్ పామ్ అనే ఏరియాలో ఫ్రెండ్ ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వెళ్లగా అప్పటికే అక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉన్న మరో మహిళ దాచుకున్న 3,28,000 రూపాయలు మాయమైంది. మే 18వ తేదీన డబ్బులు మాయం కావడంతో ఆ మహిళ సమీపంలో ఉన్న అరే పోలీస్ స్టేషన్ లోని పోలీసులను సంప్రదించి ఈ ఘటన గురించి ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ఆ ఫుటేజీలలో సీరియల్ యాక్టర్లు మహిళ ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించిన పోలీసులు ఆ అపార్ట్ మెంట్ నుంచి పారిపోయిన యాక్టర్లను పట్టుకున్నారు.సీరియల్ యాక్టర్ల దగ్గర ఉన్న 50వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో సీరియల్ యాక్టర్లు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతో దొంగతనం చేసినట్లు తెలిపారు.
తాము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని సీరియల్ యాక్టర్లు వెల్లడించారు.
లాక్ డౌన్ నిబంధనలు సీరియల్ యాక్టర్లను దొంగలుగా మార్చడం గమనార్హం.
క్రైమ్ సీరియళ్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న యాక్టర్లు క్రైమ్ చేసి వార్తల్లో నిలిచారు.సీరియల్ యాక్టర్లు అరెస్ట్ కావడంతో ఆయా యాక్టర్ల అభిమానులు అవాక్కవుతున్నారు.