యజమాని హత్య.. కారణం ఏమిటో తెలుసా?

ఎవరైనా మంచి మాట చెబితే దాన్ని ఆచరించాలి అంటారు.కానీ ఓ ప్రబుద్ధుడు తమ ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తుంటే వద్దని అన్నందుకు ఆ ఇంటి యజమానిపై దాడికి దిగి హతమార్చిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

 Mumbai Man Murders Owner For Objecting Public Urination-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుర్గావ్ ప్రాంతానికి చెందిన నంద్‌లాల్ రామ్‌దేవ్, ఆయన భార్య ఊర్మిళ ఓ వ్యక్తిని నివారించే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

అమిత్ అనే వ్యక్తి వారి ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తుండగా వద్దని నివారించారు.కోపంతో ఊగిపోయిన అమిత్ వెంటనే ఓ ఆయుధం తీసుకుని వారిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో నంద్‌లాల్ రామ్‌దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా ఊర్మిళ తీవ్ర గాయాలపాలైంది.

ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చెడు చేయవద్దని అన్నందుకు దంపతులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఒకవైపు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ అంటూ బహిరంగ మూత్రవిసర్జనను వ్యతిరేకిస్తుంటే ఇలాంటి పోకిరీల కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube