ఈ మధ్య యువత పబ్లిక్ ప్లేస్ లోనే రెచ్చిపోతున్నారు.చుట్టూ ఎంత మంది ఉన్న వారిని పట్టించు కోకుండా.
ఎవరు ఏమన్నా వినకుండా అందరు తిరిగే ప్రదేశాలలోనే ముద్దులు పెట్టుకుంటూ తిరుగు తున్నారు.ఇది వరకు ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే ఉండే ఈ అలవాటును మన దేశం లో నివసించే యువత కూడా పాటించడం గమనార్హం.
అది కూడా పబ్లిక్ గా అందరు తిరుగుతున్న ప్రదేశాలలో.
మన దేశంలో పెద్ద పెద్ద నగరాలలో బాగా డబ్బు ఉన్నవారు పోష్ లైఫ్ కు అలవాటు పడి తమ ప్రియరాలికి ప్రియుడు పబ్లిక్ ప్లేస్ లలోనే ముద్దులు పెడుతూ రెచ్చి పోతున్నారు.
అయితే ఇలాంటివి చూసి విసిగి పోయిన ఆ ప్రాంత వాసులు అక్కడ నో కిస్సింగ్ జోన్ బోర్డు ఏర్పాటు చేసారు.ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఎవ్వరు ఏమనుకుంటే మాకెందుకు మాకు ఇష్టమైన వారి మీద ప్రేమ ఎలా అయినా చిపిస్తాం ఆనుతున్నారు నేటి యువత.అయితే ముంబై లోని ఒక ప్రాంతంలో నో కిస్సింగ్ జోన్ ఏర్పాటు చేశారట ఎందుకంటే అక్కడ తరచు ఇలా నది రోడ్డు మీద ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుందట.అందుకే ఈ సొసైటీ వాసులు నో కిస్సింగ్ జోన్ అంటూ పెద్ద బోర్డు పెట్టారట.యిప్పుడు ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.
ముంబై లోని బోరీవలీ ప్రాంతంలో సత్యం శివమ్ సుందరం అనే సొసైటీ ఉంది.ఆ ప్రాంతంలో సాయంత్రం ఐదు దాటితే చాలు యువత బైకుల మీద వచ్చి ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారని ఇలా చేసే వారిని ఆపడం కోసం నో కిస్సింగ్ జోన్ అంటూ పెద్ద బోర్డు ఏర్పాటు చేశారట.ఈ విషయం పోలీసులకు చెప్పిన పట్టించు కోవడం లేదని వారే ఇలా బోర్డు ఏర్పాటు చేశారట.ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఆ సన్నివేశాలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు.