భార్యతో బలవంతంగా శృంగారం చేయడం పై ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.వివాహ అనంతరం భార్యతో బలవంతంగా శృంగారం చేయడం చట్ట విరుద్ధమని పిలవలేమని ముంబై అదనపు స్పెషల్ కోర్టు జడ్జి సంజన శ్రీ జై ఘరత్ వ్యాఖ్యానించారు.
ముంబైకి చెందిన ఓ మహిళ తన భర్తతో బలవంతంగా లైంగికంగా సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమెకి పక్షవాతం వచ్చిందని ఆరోపిస్తూ కేసు పెట్టింది.ఆమె భర్త కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయగా నిందితుడు భర్త కావడం వల్ల అతను చట్టవిరుద్ధమైన పని చశాడని చెప్పలేమని జడ్జి సంజన శ్రీ చెప్పారు.
పాస్ క్యూస్షన్ కథనం ప్రకారం మహిళ గత ఏడాది నవంబరు 22న వివాహం చేసుకుంది వివాహానంతరం భర్త అతని కుటుంబం ఆమెను అదనంగా డబ్బు తీసుకురమ్మని డిమాండ్ చేశారని, హింసించారని, అవహేళన చేశారని, నెల రోజుల తర్వాత తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు ఆమె ఆరోపించింది.ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఈ జంట ముంబై సమీపంలోని హిల్ స్టేషన్ అయిన మహాబలేశ్వరం కు వెళ్ళింది.
అక్కడ భర్త మళ్లీ భార్య పై బలవంతం చేశాడు.ఆ తర్వాత ఆమెకు అనారోగ్యం అనిపించి వైద్యులు సంప్రదించగా తన నడుము కింద పక్షవాతం వచ్చినట్లుగా తేల్చారు.
దీంతో ఆ మహిళ తన భర్త, ఇతరులపై ముంబైలో కేసు పెట్టింది.
ఈ కేసులో నిందితులైన భర్త ముందస్తు బెయిల్ దరఖాస్తు కోర్టును ఆశ్రయించారు.నిందితులకు ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేయడాన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది.అయితే వరకట్నం డిమాండ్ పై మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ డిమాండ్ ఎంత చేశారో చెప్పలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అంతేకాకుండా బలవంతపు శృంగారం సమస్య న్యాయ పరమైన అంశం నిలబడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.ఈ కేసుపై న్యాయమూర్తి సంధ్య శ్రీ మాట్లాడుతూ అవివాహిత పక్షవాతం రావడం దురదృష్టకరం అయితే వీళ్ళు దరఖాస్తుదారులు (భర్త అతని కుటుంబం) దీనిపై బాధ్యత వహించ లేరు.
బెయిల్ దరఖాస్తు దారులు పై చేసిన ఆరోపణల స్వభావాన్ని పరిశీలిస్తే ఈ విచారణ అవసరం లేదు విచారణ సమయంలో సహకరించడానికి నిందితులు సిద్ధంగా ఉన్నారని ముంబై అదనపు స్పెషల్ న్యాయమూర్తి పేర్కొన్నారు.