నిండు గర్భిని మరికాసేపట్లో లోకానికి ఒక ముక్కుపచ్చలారనిబిడ్డ ను కనబోతుంటే డాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో పండంటి బిడ్డ ఒక నర్సు చేతులమీదుగా ఈ లోకంలోకి వచ్చింది .ఆ బిడ్డ మృతికి కారణమయ్యాడని ఆ వైద్యుడికి ముంబైలోని వినియోగదారుల ఫోరం భారీ ఫైన్ రూ.19 లక్షల నష్టపరిహార చెల్లించాలని ఆదేశించింది.బిడ్డను కోల్పోయిన ఆ మాతృమూర్తికి జాప్యం లేకుండా చెల్లించాల్సిందే అని తీర్పులో పేర్కొంది .2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆస్పత్రికి తరచూ వెళ్లేది.అక్కడే అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆస్పత్రికి వెళ్లినప్పుడు సదరు వైద్యుడు మరో ఆస్పత్రికి పంపేసి చేతులు దులుపుకున్నాడు.
ఆమె కాందివ్లి లోని మరో ఆస్పత్రికి వెళ్లారు.అక్కడి వైద్యుడు నిర్లక్ష్య వైఖరితో పరీక్షలు నిర్వహించి నర్సుకు చూసుకోమని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు.నర్సు తనకు వచ్చిన దే చేసి చూపేయడం తో పాప పుట్టిన ఓ అరగంటలో చనిపోయింది.దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంలో కేసు వేసారు .నేడు కాందివ్లి వైద్యుడు రూ.19 లక్షలు చెల్లించాల్సిందేనని ఆ ఫోరం ఆదేశించింది.