హనీమూన్ కు వెళ్లి జైలుపాలైన జంట.. ఏం జరిగిందంటే?

సాధారణంగా పెళ్లైన ప్రతి జంట హనీమూన్ కు వెళ్లటానికి ఆసక్తి చూపుతుందన్న సంగతి తెలిసిందే.అయితే ఒక జంటకు హనీమూన్ కొత్త సమస్యలను సృష్టించింది.

 Mumbai Couple Jailed In Qatar In Drug Case, Drugs Case, Custom Officials, Qatar-TeluguStop.com

భార్యాభర్తలిద్దరూ జైలుపాలయ్యేలా చేసింది.అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుకున్న భారత్ లోని ముంబైకు చెందిన జంట విదేశాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.

గతేడాది జులై నెలలో ఖతార్ పర్యటనకు వెళ్లిన ఈ జంట చేయని తప్పుకు 14 నెలల జైలు శిక్ష అనుభవించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకు చెందిన శరీఖ్, ఒనీబాలకు గతేడాది జూన్ నెలలో వివాహం జరిగింది.

పెళ్లి తరువాత హనీమూన్ కోసం వీళ్ల బంధువు తబస్సం రియాజ్ ఖురేశీ అనే వ్యక్తి ఖతార్ కు వెళ్లాలని సూచించడంతో పాటు టికెట్లు బుక్ చేశాడు.అయితే వీళ్ల బంధువు బ్యాగ్ లలో 4కిలోల డ్రగ్స్ పెట్టాడు.

ఈ విషయం తెలియని కొత్త జంట ఆనందంగా హనీమూన్ కు వెళ్లింది.అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వీళ్ల దగ్గర డ్రగ్స్ దొరికాయి.

దీంతో ఖంగు తిన్న ఆ జంట తమకే పాపం తెలియదని అధికారుల ముందు బాధను వెళ్లగక్కింది.అయితే వాళ్లు ఎంత చెప్పినా వినకుండా అధికారులు కోర్టులో హాజరుపరిచి జైలుశిక్ష పడేలా చేశారు.

దీంతో ఆ జంట చేయని తప్పుకు ఖతార్ జైలులో శిక్ష అనుభవించింది.అయితే ఆ తర్వాత అధికారుల విచారణలో ఆ జంట తప్పేం లేదని తేలింది.దీంతో దౌత్యపరమైన మార్గాల ద్వార వాళ్లను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు.

జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube