ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో అర్థంగాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.కాగా ఈ వైరస్ సోకకుండా అన్ని విధాలుగా తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందుండి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.వారు తమ వృత్తి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు.
అయితే వీరిలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో సదరు సిబ్బంది కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది.తాజాగా ముంబైలో చెంబూర్లోని ఓ ఎలెక్ట్రానిక్ దుకాణంగో చోరీ జరిగింది.
ఈ చోరీ కేసులో భాగంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు.ఎట్టకేలకు దొంగలను అరెస్ట్ చేశారు.
అయితే ఇదే వారి కొంపముంచింది.దొంగలకు కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్ అని తేలింది.
దీంతో పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాగా ఈ ఘటనలో 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇప్పటికే ముంబై నగరంలో పోలీసులకు పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ సోకగా, వారిలో 25 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇలా దొంగతనం కేసులో దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు కరోనా రావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు.కాగా తమ తోటి ఉద్యోగులు త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పోలీసులు కోరుకుంటున్నారు.