బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఇండస్ట్రీలో నటుల మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రంగుల ప్రపంచంలో కెమెరా ముందు ఎప్పుడు నవ్వుతూ కనిపించే వారి జీవితాలలో కూడా విషాదాలు ఉంటాయని, తీవ్ర మానసిక ఒత్తిళ్లు ఉంటాయని విషయం బయటి ప్రపంచానికి అర్ధమైంది.
ఇప్పుడు సుశాంత్ తరహాలోనే చాలా మంది సెలబ్రెటీలు ఆత్మహత్యలు ఈ మధ్యకాలంలో కలవరపెడుతున్నాయి.ఓ వైపు కరోనాతో చిత్ర పరిశ్రమ వణికిపోతూ ఉంటే మరో వైపు ఈ ఆత్మహత్యలు మరింత ఇబ్బందికరంగా మారిపోయాయి.
కొంత మంది ఆర్ధిక కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే మరికొంత మంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతం అవుతూ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.ముంబైలో ఓ సీరియల్ నటుడు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విషాదఘటన వెలుగుచూసింది.
బోజ్పురి నటి అనుపమ పాఠక్ ముంబైలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 2న దహిసార్ లోని తన అపార్టుమెంట్ లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
ఆత్మహత్యకు ఒక రోజు ముందు అనుపమ పాఠక్ ఫేస్ బుక్ లైవ్ లో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.అలాగే రెండు కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది.
ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మలద్ లోని విస్డమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో నేను పెట్టుబడి పెట్టాను.నిబంధనల ప్రకారం డిసెంబర్ 2019లో ఆ కంపెనీ రావాల్సిన డబ్బును తిరిగివ్వాలి.
కానీ ఇవ్వకుండా కంపెనీ ఇబ్బంది పెడుతోందని రాసింది.మరోవైపు మనీశ్ ఝా అనే వ్యక్తి తన టూవీలర్ వెహికిల్ లాక్ డౌన్ కొనసాగుతున్నపుడు మేలో తీసుకొని, ఇప్పటివరకు తిరిగివ్వడం లేదని ఆరోపించింది.
ఈ కారణాల వలన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.