రాజు అనే క్యాబ్ డ్రైవర్ తాజాగా ముమైత్ ఖాన్ తనని మోసం చేసింది అంటూ పోలీసు కేసు పెట్టాడు.గోవా వరకు తన క్యాబ్ బుక్ చేసుకొని పూర్తి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇక సెలబ్రెటీలకి సంబందించిన వార్తలు వస్తే మీడియా ఛానల్స్ కి అత్యుత్సాహం వచ్చేస్తుంది.దీంతో నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ఆమెపై కథనాలు ప్రసారం చేయడం మొదలు పెట్టింది.
ఆ డ్రైవర్ రాజుని ఇంటర్వ్యూ చేస్తూ ముమైత్ ఖాన్ అతన్ని ఎలా మోసం చేసిందో చెప్పించే ప్రయత్నం చేశారు.అయితే ఈ గందరగోళం తన దృష్టికి రావడంతో ముమైత్ ఖాన్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చింది.
తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలని మీడియా వాళ్ళు ఇప్పటికైనా నిలిపేయాలని కోరింది.ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రాజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా మీడియా ముందుకి వచ్చిన ముమైత్ ఖాన్ మాట్లాడుతూ తానూ 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, తన క్యారెక్టర్ ఏంటో అందరికి తెలుసని చెప్పుకొచ్చింది.ఓ క్యాబ్ డ్రైవర్ ను మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా చానళ్లు తన పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశాయని ముమైత్ ఆవేదన వ్యక్తం చేశారు.నా క్యారక్టర్ ను నిర్ణయించడానికి ఈ మీడియా చానళ్లకు ఏం హక్కుంది అని ప్రశ్నించారు.
విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించకపోవడంతో క్యాబ్ లో గోవా వెళ్లానని, క్యాబ్ డ్రైవర్ కు 23,500 చెల్లించానని వెల్లడించారు.కానీ డ్రైవర్ రాజు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తనను వేధించాడని ముమైత్ ఖాన్ ఆరోపించారు.
మరి వీరిద్దరి ఆరోపణలలో ఎవరి వైపు నిజం ఉంది అనేది ఇక పోలీసులే నిర్ణయించాలి.