మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’పై మెగాఫ్యాన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీబడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న అంచనాలను చిత్ర యూనిట్ సభ్యులు పెంచుతూనే ఉన్నారు.చిరంజీవి సినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంటుంది.
అలాంటి చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించనుండటంతో సినిమా వెయిట్ భారీగా పెరిగి పోయింది.
అమితాబచ్చన్తో పాటు తమిళస్టార్ విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ సుదీప్, మలయాళ స్టార్ ఇంకా పలువురు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఇక హీరోయిన్స్ నయనతార, తమన్నా, నిహారిక, పూనం కౌర్లు కూడా ఈచిత్రంలో కనిపించబోతున్నారు.జగపతిబాబు, సునీల్లు సినిమా స్థాయిని పెంచడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమా మొత్తం స్టార్స్తో నింపేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా మరో స్టార్ను కూడా తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన బాలీవుడ్ స్టార్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
టబుతో ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను చేయిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు.వారం రోజుల డేట్లను అప్పుడే టబు ఇచ్చిందని, త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతుంది అంటూ సమాచారం అందుతుంది.
త్వరలోనే సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన విషయాలను యూనిట్ సభ్యులు వెళ్లడి చేసే అవకాశం ఉంది.
ఇలా వరుసగా సినిమాలో స్టార్స్ను పెట్టడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతూనే ఉంది.ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రంను 2019 ఏప్రిల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
బాహుబలి తర్వాత అంతటి స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాహుబలి మొదటి పార్ట్ కలెక్షన్స్ను టార్గెట్ చేసింది.
తాజా వార్తలు