టాలీవుడ్ బావ, బామర్ది రానా మరియు నాగ చైతన్యల కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.వీరిద్దరు కలిసి నటించేందుకు ఎప్పుడో ఓకే చెప్పారు.
అయితే కథ ఇప్పటి వరకు సిద్దం కాక పోవడంతో సినిమా పట్టాలపైకి ఎక్కలేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే సంవత్సరం వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం రానా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.
మరో వైపు చైతూ కూడా ‘మజ్ను’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.వేసవిలో వీరిద్దరి కాంబోలో సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
తమిళంలో మరియు తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.తెలుగు మరియు తమిళంలో కూడా రానా కనిపించనుండగా, చైతూ మాత్రం ఒక్క తెలుగులోనే నటించనున్నాడు.
తమిళ వర్షన్కు మరో హీరో ఆ స్థానంలో కనిపించనున్నాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
.