సమాజ్ వాజీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురుగ్రామ్ లోని మేధాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.ఆసుపత్రికి వెళ్లినా ‘నేతాజీ’ని కలవడం సాధ్యం కాదని, కాబట్టి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేసారు.
ములాయం ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు.మరోవైపు ములాయం కోసం అవసరమైతే కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు.
అదేవిధంగా ఆయన తర్వగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.