తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంటర్ టైనర్ గా నిలిచిన ముక్కు అవినాష్ మంచి క్రేజ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.జబర్దస్త్ లో చేస్తున్న ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో చేసేందుకు మల్లె మాల వారితో అగ్రిమెంట్ ను బ్రేక్ చేశాడు.అందుకు గాను ఏకంగా రూ.10 లక్షల రూపాయలను మల్లెమాల వారికి చెల్లించినట్లుగా వార్తలు వచ్చాయి.బిగ్ బాస్ లో పాల్గొనేందుకు జబర్దస్త్ లో ఛాన్స్ ను వదిలేసి 10 లక్షలు వారికి వెనక్కు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనేందుకు అవినాష్ షో తర్వాత కూడా ఆరు నెలల పాటు మా టీవీ వారికి ఒప్పందంలో ఉండాలని అగ్రిమెట్ ఉంది.
మాటవీలో జరిగే కార్యక్రమాల్లో మాత్రమే ఆయన పాల్గొనాల్సి ఉంది.
ఆరు నెలల తర్వాత కాని ఆయన మరో ఛానెల్ కార్యక్రమంకు హాజరు కాకూడదు.
ఇది ఒప్పందం.ఇప్పుడు ఈ ఒప్పందంను కూడా ముక్కు అవినాష్ బ్రేక్ చేశాడు అనే వార్తలు వస్తున్నాయి.
నాగబాబు పిలుపు మేరకు జీ తెలుగులో బొమ్మ అదిరింది కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అయ్యాడట.అందుకోసం స్టార్ మాతో ఉన్న ఒప్పందంను బ్రేక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు అందుకోసం స్టార్ మా కు కూడా ఆయన భారీ మొత్తంను చెల్లించాడు.జీ తెలుగు వారు ఇచ్చే పారితోషికం అంతకు మించి ఉండటం వల్లే ఆయన ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
మొన్నటి వరకు స్టార్ మాలో ఆయన కామెడీ షో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు మాత్రం బొమ్మ అదిరిందికి వెళ్తున్నాడు అంటున్నారు.
ముక్కు అవినాష్ ఎంట్రీతో అయినా బొమ్మ అదిరింది షో కు మంచి రేటింగ్ వస్తుందేమో చూడాలి.