బిగ్ బాస్ లో ఈసారి జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఉంటాడు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఆ విషయం ఫై షో ప్రారంభం రోజు క్లారిటీ వచ్చింది.
అవినాష్ ఉంటాడు అనుకున్నది అంతా కూడా పుకార్లే అంటూ అంతా అనుకున్నారు.అయితే షో మూడు నాలుగు రోజులు పూర్తి అయినప్పటి నుండి కూడా కుమార్ సాయి మరియు అవినాష్ లు షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మొదటి వారం అయిన తర్వాత బిగ్బాస్ లోకి కుమార్ సాయి ఒక్కడే ఎంట్రీ ఇచ్చాడు.ఆ సమయంలో కూడా అవినాష్ ఉండక పోవచ్చు అన్నారు.
కాని ఎట్టకేలకు నిన్నటి ఎపిసోడ్లో అవినాష్ ఎంట్రీ ఇచ్చేశాడు.అనూహ్యంగా బిగ్బాస్ లో జోకర్ ని అంటూ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కు మంచి వెల్ కమ్ దక్కింది.
జబర్దస్త్ కామెడీ షో తో అవినాష్ కు మంచి గుర్తింపు దక్కింది.ఆ కామెడీ షో తో అవినాష్ కు ఒప్పందం ఉంది.ఆ ఒప్పందం ప్రకారం ఇతర షోలకు వెళ్ల కూడదు.మద్యలో కామెడీ షోను వదిలి పెట్టకూడదు.ఆ విషయంలో ఒప్పందం ఉన్న కారణంగా బిగ్బాస్ కోసం ఏకంగా రూ.10 లక్షలు చెల్లించి మరీ బిగ్బాస్కు వచ్చాడట.వారంలో అయిదు లక్షల రూపాయల పారితోషికంను బిగ్బాస్ నిర్వాహకులు ఇస్తారని తెలుస్తోంది.అందుకే ముక్కు అవినాష్ ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉంటాను అనే నమ్మకంతో వచ్చాడు.కనీసం పది వారాలు ఉన్నా కూడా 50 లక్షలు వస్తాయి.కనుక జబర్దస్త్ కు 10 లక్షలు చెల్లించడం పెద్ద సమస్య కాదు అనుకున్నాడేమో.
అందుకే మల్లెమాల వారికి ఆ మొత్తం ఫైన్ చెల్లించి ఇప్పుడు బిగ్బాస్లో ఎంట్రీ ఇచ్చాడు.ఒక వేళ బిగ్బాస్ నుండి వెంటనే ఎలిమినేట్ అయినా కూడా ఆయనకు జబర్దస్త్లో మళ్లీ ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుంది.
అందుకే ఎలాంటి డౌట్ లేకుండా మల్లె మాల వారితో ఒప్పందం చేసుకుని ముక్కు అవినాష్ బిగ్బాస్ లో ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు.