భారతదేశంలో జియో సంస్థ ఫై సేవలను అతి త్వరలో ప్రారంభించబోతునట్లు తాజాగా ముఖేష్ అంబానీ వెల్లడించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ అంబానీ భారత దేశంలో 5g సేవలు 2021 సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రజలకు దగ్గరకు తీసుకరాబోతునట్లు వెల్లడించారు.
అయితే ఇందుకు సంబంధించి వివరాలను కొన్ని తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు.
భారతదేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆత్మ నిర్భర్ లో భాగంగా ఈ కార్యక్రమం సాక్షి భూతంగా నిలుస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే గూగుల్ సంస్థ కలిపి అతి తక్కువ ధరకే భారతదేశంలోని ప్రజల కోసం అతి తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకువచ్చే ఆలోచనలో కూడా ముందడుగు వేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.భారతదేశంలో వీలైనంత త్వరగా 5g సేవలు మొదలుపెట్టడానికి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ముకేశ్ అంబానీ తెలియజేశారు.
ఇకపోతే ఇందుకు సంబంధించి పూర్తి టెక్నాలజీని, అలాగే నెట్వర్క్ సంబంధించి సాంకేతిక పరికరాలతో తాము జియో 5జి సేవలను భారత్లో వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి 5g సేవలు అందించడానికి ఎప్పటి నుంచో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఇందులోభాగంగానే క్వాల్కమ్, శాంసంగ్ కంపెనీలతో జియో సంస్థ కలిసి పని చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలియజేశారు.
ఎప్పుడైతే 5g టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన వెంటనే తాము భారతదేశంలో వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అయితే ఈ మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న 4g సేవల్లో రిలయన్స్ సంబంధించి స్పీడ్ చాలా తగ్గిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.