ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలలో ఒకటయినటువంటి తాజ్ మహల్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ తాజ్ మహల్ ని మొగలాయి చక్రవర్తి అయినటువంటి షాజహాన్ తన భార్య ముంతాజ్ పై ఉన్నటువంటి ప్రేమకి గుర్తుగా నిర్మించాడని చరిత్ర చెబుతోంది.
అయితే షాజహాన్ గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…
భారత దేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో షాజహాన్ ఒకరు.కాగా షాజహాన్ తన పరిపాలనా కాలంలో ప్రజలను బాగానే చూసుకున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి తప్పులు వల్ల చరిత్రహీనుడయ్యాడు.
అయితే ఇందులో కొందరు యూరోపియన్లు మరియు ఇంగ్లాండ్ దేశస్థులు రాసినటువంటి పుస్తకాల్లోని కొన్ని మాటలు ఆధారంగా షాజహాన్ దాదాపుగా 7 మందిని పెళ్లి చేసుకున్నాడని ఇందులో తన నాలుగవ భార్య ముంతాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ముంతాజ్ కి అప్పుడే తన కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేయడంతో అతడిని షాజహాన్ హతమార్చి ముంతాజ్ మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆమెకి 14 మంది సంతానం.కాగా ముంతాజ్ చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు పర్వార్ ఖనుమ్ ని షాజహాన్ పెళ్లి చేసుకున్నాడు.
అయితే షాజహాన్ మంచి స్త్రీ లోలుడని దాంతో తనకు నచ్చిన అందమైన యువతులను కన్నె పిల్లలను తన విశ్రాంత మందిరంలో ఉంచుకొని సరస సల్లాపాలు సాగించేవాడని కొన్ని పుస్తకాల లో వ్రాయబడింది. అంతేగాక షాజహాన్ తన మొదటి భార్య కి జన్మించిన ఇద్దరి కూతుళ్లతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు గాను “రాజు తన సుందర వనంలో పడినటువంటి ఫలాలను రుచి చూసే హక్కు ఉంటుందని వ్యాఖ్యలను చరిత్రకారుల చేత తన చరిత్ర పుస్తకంలో వ్రాయించాడు.
కాగా చివరికి షాజహాన్ తన కొడుకు ఔరంగ జేబు చేతిలో బందీ అయ్యి మరణించాడు.కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ విషయాలు తెలియవు.