కేజీఎఫ్ సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే కన్నడ యంగ్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలోనే యష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది.
మరో వైపు తెలుగు, తమిళ బాషలకి సంబందించిన దర్శకులు కూడా యష్ తో సినిమాలు చేయడం కోసం కథలు వినిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.అయితే హీరో యష్ మాత్రం నెక్స్ట్ సినిమా విషయంలో ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నాడు.
కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఆలోచించాలని యష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే యష్ తో సినిమా చేయబోతున్న విషయాన్ని కన్నడ యంగ్ డైరెక్టర్ తాజాగా స్పందించాడు.
ముఫ్తీ మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన నర్తన్ కేజీఎఫ్ స్టార్ యష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.స్టార్ హీరో శివరాజ్ కుమార్ 125వ సినిమా భరతి రణగల్’సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో నర్తన్ ప్రకటించారు.
శివరాజ్ కంటే ముందే యష్ కు కథ చెప్పి ఒకే చెప్పడం జరిగిందని దర్శకుడు చెప్పాడు.రెండు పెద్ద ప్రాజెక్టులలో ఒకేసారి తీయడం కష్టమని భావించి ఫస్ట్ అంగీకరించిన ప్రాజెక్టును ఫినిష్ చేయనున్నట్లు నర్తన్ క్లారిటీ ఇచ్చారు.
యష్ తో సినిమా పూర్తయిన తర్వాత శివరాజ్ కుమార్ తో కలిసి భ్రమతి రణగల్ సినిమా చేయనున్నట్లు తెలిపాడు.యష్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్న సినిమాకు జటస్య అనే పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలో యష్ సరసన తమన్నా నటించనుందని టాక్ వినిపిస్తుంది.
.