కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం గత కొంత కాలంగా రాజకీయ అలజడి సృష్టిస్తున్నారు.కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమైనట్లు గా ప్రచారం జరగడమే కాకుండా, ముద్రగడ సైతం యాక్టివ్ గా ఉంటూ అనేక అంశాలపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పందిస్తున్నారు.అనేక అంశాలపై లేఖలు రాస్తూ తను ఉనికిని చాటు కుంటున్నారు.2014 ఎన్నికల కు ముందు కాపులను బీసీల్లో చేరుస్తాము అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడం , పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోవడం పై ముద్రగడ ఉద్యమం మొదలుపెట్టారు.ఆ ఉద్యమంలో ఆయన ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ఇక 2019 ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చుతాము అనే మోస పూరిత హామీ ఇవ్వలేను అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రకటన చేయడం, తరువాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి వ్యవహారాలతో ముద్రగడ పూర్తిగా కాపు ఉద్యమానికి దూరం అయ్యారు.
ఇక ఆ తరువాత సైలెంట్ అయినా, ఈ మధ్యకాలంలో యాక్టివ్ కావడం, కొత్త రాజకీయ వేదిక తెరపైకి తెచ్చే ఆలోచనలో ఉండడంతో ఇదంతా వైసిపి అధినేత జగన్ వ్యూహంలో భాగంగానే, ముద్రగడ యాక్టివ్ అయ్యారని, కాపు సామాజిక వర్గం లో చీలిక తెచ్చి జనసేన టిడిపి కి వెళ్లే ఓటు బ్యాంకును చీల్చే ఆలోచనలో ఉన్నారనే అనుమానాలు కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ముద్రగడ విషయంలో కాపుల్లో అను మానాలు తలెత్తడం, ఆయన వైసీపీ కోసమే రాజకీయంగా యాక్టిివ్ అవుతున్నారనే విషయం కాపు సామాజిక వర్గంలో కి వెళ్లడానికి కారణం ‘ ముద్రగడ ‘ పై వైసీపీ ముద్ర పడేలా చేసింది.ఆ భయంతోనే నాలుగు రోజుల క్రితం కాపు ఉద్యమ సమయంలో కాపులపై నమోదైన కేసులు అన్నిటినీ ఎత్తివేస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.దీనికి లేఖ ద్వారా ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు.
స్వయంగా జగన్ ను కలుద్దామని ఉన్నా, తనపై వైసీపీ ముద్ర వేస్తారు అనే భయం ముద్రగడ పద్మనాభం లో ఉంది.