నిన్నటి వరకు తుని హింసాకాండలో అరెస్టయిన వారిని వదిలేయాలని లేదంటే తనని అరెస్టు చేయాలని అమలాపురం, కాకినాడ పోలీసు ఠాణాల ముందు బైఠాయించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మాట మార్చినట్లు కనిపిస్తోంది.రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తు దీక్షకు దిగిన గురువారం ముద్రగడను రెండు కేసుల్లో అరెస్టు చేసారు.
ముద్రగడను అరెస్టు చేయడానికి వచ్చిన సిఐడి బృందంను ఇంట్లోకి అనుమతించేందుకు కూడా నిరాకరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియాకు వెల్లడించిన కొద్ది సపటికే పోలీసులు ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఈ అరెస్ట్ను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు గట్టిగా యత్నించడంతో కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్ట్ నేపథ్యంలో జిల్లాలో ఆతని అనుచరులు, కాపునాడు నేతలు ధర్నాలకు, దీక్షలకు దిగే ఆస్కారం ఉండటంతో జిల్లాలో సెక్షన్ 144, పోలీస్ చట్టం 30 అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ చెప్పారు.
శాంతిభద్రతలకు విఘాటం కలిగిస్తే చర్యలు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.