ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు తరువాత ఆసక్తి కొద్ది దర్శకుడుగా మారారు.అందులో భాగంగా మొదటి సినిమాని కన్నడ రీమేక్ గా వానని తెరకెక్కించారు.
అది ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనే టాక్ తెచ్చుకున్న ఎందుకనో హిట్ కాలేదు.తరువాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ తూనీగా తూనీగా అనే సినిమా తీసారు.
ఇది కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో దర్శకత్వంకి ఎనిమిదేళ్ళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ సారి ట్రెండీ కథాంశంతో డర్టీ హరి అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అయ్యాడు.
బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.
ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఆర్జీవీ స్టైల్ లో చాలా బోల్డ్ గా చూపించి ఎంఎస్ రాజు అందరికి షాక్ ఇచ్చారు.
సినిమా మీద కూడా ఒక హైప్ క్రియేట్ చేశారు.అయితే కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిపోయింది.అయితే ఇప్పుడు ఈ సినిమాని కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు ఎంఎస్ రాజుతో డర్టీ హరి సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో శ్రవణ రెడ్డి, సిమ్రాత్ కౌర్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.