తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేరుందిన కమెడియన్స్ ఉన్నారు.ఇప్పటికి వాళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.
ఇప్పుడొచ్చిన కమెడియన్స్ కంటే ఒక్కపుడు వచ్చిన కమెడియన్స్ అంటేనే ప్రేక్షకులు బాగా ఇష్టపడుతారు.అందులో ఎక్కువగా బ్రహ్మనందం, అలీ, ఎమ్ ఎస్ నారాయణ, సునిల్ వంటి నటులు ఉండగా ఆ నటులకు ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ ఉంది.
ఇక వీళ్ళు ఏ పాత్రలో నైనా జీవిస్తారు.ముఖ్యంగా తాగుబోతు పాత్రలలో వీరిని మించిన వాళ్లు లేరు.
రారని చెప్పాలి.ముఖ్యంగా ఎమ్ఎస్ నారాయణ మాత్రం తాగుబోతు పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తారు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మైలవరపు సూర్యనారాయణ అనే ఈయనను ఎమ్ ఎస్ నారాయణ అని పిలుస్తారు.
ఇక ఈయన 1951 జన్మించగా.2015 జనవరి 23 లో ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం అయ్యారు.ఈయన హాస్యనటుడు గానే కాకుండా.
దర్శకుడుగా, రచయితగా కూడా పని చేశారు.ఈయన దాదాపు 17 సంవత్సరాల కెరీర్లో 700 పైగా సినిమాలలో నటించాడు.
ఈయన చదువుకునే రోజుల నుంచీ హాస్య రచనలు చేశారట.అంతేకాకుండా కొన్ని నాటకాలు కూడా రాశారట.
ఇక ఈయన దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా చేశారట.ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు ఎమ్ఎస్ నారాయణ.
ఇక మా నాన్నకి పెళ్ళి అనే సినిమాలో అందులో తాగుబోతు పాత్రలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.అలా ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలలోనే నటించే అవకాశాలు చాలా వచ్చాయి.
అలా తన చివరి వరకు తాగుబోతు పాత్రలలోనే నటించారు.ఇక ఈయనకు రెండు సినిమాలో ఉత్తమ హాస్యనటుడుగా కూడా అవార్డు సొంతం చేసుకున్నారు.ఇక ఈయన అనారోగ్య కారణాల వల్ల 2015 లో తుది శ్వాస విడిచారు.ఇక ఇప్పటికి ఈయనను తలచుకోని ప్రేక్షకులు లేరని చెప్పాలి.ఇప్పటికీ ఈయన సినిమాలను ప్రేక్షకులు వీక్షిస్తూనే ఉంటారు.ఇదిలా ఉంటే ఈయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతుంది.
ఇక అందులో ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
అందులో తాను తాగు బోతు సీన్స్ లో నటించే సమయంలో తాను మేకప్ కు గౌరవం ఇస్తాను అని నాకు సరస్వతి కల అద్ధిందని.నేను మేకప్ వేసుకున్నాక తాగిన సన్నివేశం లేదు అంటూ అలా చాలా వరకు గ్లిజరిన్ లేకుండా నటించాను అని అన్నారు.ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఆయన అభిమానులు విని ఆయనను మరోసారి గుర్తుకు చేసుకున్నారు.
ఇలాంటి గొప్ప నటుడిని కోల్పోయాము అంటూ బాధ పడుతున్నారు.ఇక ఆయన తన గురించి ఇంకేమి విషయాలు పంచుకున్నారో పూర్తి వీడియో లో చూడండి.