దోని అంటే చాలా మందికి చచ్చేంత పిచ్చి.క్రికెట్ లో ధోని ఓ మైలు రాయి.
ఓ లెజెండ్ అనే చెప్పాలి.మిస్టర్ కూల్ కెప్టెన్ గా ధోనికి మంచి పేరుంది.
ఎంత క్లిష్ట సమయంలోనైనా ధోని ఓర్పుగా నేర్పుతో టీమిండియాను ముందుకు తీసుకెళ్లే వైనం ఇప్పటికీ జనాలు మర్చిపోరు.అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే కదా.ధోని మొత్తంగా చూస్తే సుమారు 16 సంవత్సరాల పాటుగా టీమిండియాకు తన సేవలను అందించాడు.తాజాగా ధోనీ తన ఫాం హౌస్ లో గడుపుతున్నాడు.
తన కుటుంబంతో అక్కడే గడుపుతున్నాడు.ప్రస్తుతం తన ఫ్యామిలీతో హిమాచల్ ప్రదేశ్లో టూర్ ను దోని ఎంజాయ్ చేస్తున్నాడు.
మీనాబాగ్ అనే హోటల్లో కుటుంబంతో గడిపేస్తున్నాడు.ధోని హోటల్ లో పనిచేస్తున్న వారితో చాలా సేపు ముచ్చటించారు.
ఈ విషయాన్ని మీనాబాగ్ హోటల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది.
ధోనీకి సేవలు చేసేందుకు దేవ్ అనే ఉద్యోగి సిమ్లాలోని మీనాబాగ్ హోటల్ నుంచి ఆ ప్రాంతానికి బదిలీ అయినట్లు హోటల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.ఆ వ్యక్తి ధోనిని కలవడం కోసం పోలీసులతో కూడా దెబ్బలు తిన్నాడు.చివరికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అతడు కలిశాడు.
ఆటోగ్రాఫ్ తీసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ఈ విషయాన్ని ధోని భార్య సాక్షి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ఆదివారం దోని, సాక్షిల 11వ పెళ్లి రోజు సందర్భంగా ఓ బహుమతిని అందజేశాడు.ధోని తన భార్య సాక్షికి ఓ వింటేజ్ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఆమె తెలియజేసింది.
వీరి పెళ్లి రోజు సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ట్వీట్ చేసింది.
మా రాజు, రాణికి సూపర్ హ్యాపీ యానివర్సరీ చెన్నై టీమ్ తమ శుభాకాంక్షలను తెలియజేసింది.