కరోనా వైరస్… ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ కారణంగా పలు దేశాలు లాక్డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వానికి తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే పలానా రంగం అంటూ లేకుండా చాలా మంది ప్రభుత్వానికి తమకు తోచిన సహాయాన్ని అందించారు.
కాగా క్రీడా రంగానికి చెందిన సచిన్ టెండూల్కర్ ఇప్పటికే భారత ప్రభుత్వానికి రూ.50 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే.అయితే భారత క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ ఆపత్కర సమయంలో తనవంతు సాయంగా కేవలం రూ.లక్ష మాత్రమే విరాళం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.దీంతో అభిమానులు అతడిని చాలా ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ధోనీ భార్య సాక్షి, మీడియా వర్గాలపై మండి పడుతోంది.
నిజానిజాలు తెలియకుండా మీడియా వారు ఇలాంటి వార్తలను ఎలా ప్రచురిస్తారంటూ ఆమె మండిపడుతోంది.
కాగా ధోనీ ఈ విషయంపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.