ప్రస్తుతం ఐపీఎల్ 13వ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో కొందరు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు అలాగే మిగతా టీమ్స్ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా వీటికి సమాధానంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోని స్పందించారు.ఈ సందర్భంగా ఆవిడ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ భారీ సందేశాన్ని క్రికెట్ అభిమానులకు తెలిపింది.
ఇందులో భాగంగానే ఆటలో గెలుపోటములు అత్యంత సహజం అని.కానీ, తన దృష్టిలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ విన్నర్ అని ఆవిడ స్పందించారు.
ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆప్స్ కు చేరలేక నిలబడిన తరువాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన కూడా చెన్నై అభిమానులు తీవ్ర నైరాశ్యం చెందుతున్న కారణంగా సాక్షి సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాన్ని తెలిపింది.క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే అని కొన్నింటిలో గెలుస్తారని.
కొన్నింటిలో ఓడిపోతారు అని, అందులో కొన్ని అద్భుతమైన విజయాలు, కొన్ని నిరాశపరిచే ఓటమి వాటి వల్ల కొందరికి సంతోషాలు కలుగుతాయి.ఓటములు మరికొందరికి గుండె పగిలేలా మిగులుస్తాయి అని సాక్షి సోషల్ మీడియా వేదికగా చేసింది.
ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు మద్దతుగా నిలుస్తూ.” మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు లాంటివి.మనోబలంతో వాటిపై పైచేయి సాధించాలని.ఇది కేవలం ఆట మాత్రమే, మీరు అప్పుడు విజేతలే, ఇప్పుడు కూడా విజేతలే అంటూ.నిజమైన యోధులు యుద్ధం చేయడం కోసమే పుడతారు అంటూనే.చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్ కింగ్స్ గానే ఉంటారు అంటూ తన భావోద్వేగాన్ని తెలుపుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు మద్దతుగా నిలిచింది.
తాజా సీజన్ లో ప్లే అఫ్స్ నుండి వైదొలిగిన మొదటి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ వారి ఆటతీరుతో అభిమానులు బాధలో మునిగిపోయారు.అయితే సాక్షి ధోని చేసిన పోస్టు కు నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.