మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఏ చిన్న విషయం అయినా క్రికెట్ అభిమానులకు వెరీ ఇంట్రెస్టింగే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తన ఫామ్ హౌజ్లో సేంద్రియ వ్యవసాయంతో పాటు కడక్నాథ్ కోళ్లను ధోని పెంచుకుంటున్న సంగతి అందరికీ విదితమే.
కాగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది.ధోని తన డాటర్ జీవా, వైఫ్ సాక్షితో కలిసి సిమ్లాలో దిగిన ఫొటోనే అది అని తెలుస్తోంది.
డిఫరెంట్ లుక్తో ఉన్న ఎం.ఎస్.ధోని విత్ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇదిలా ఉండగా ఐపీఎల్ 2021 సీజన్లో పాయింట్స్ వైజ్ సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ రద్దు కాగా, ఆ లీగ్ను మరోసారి యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎం.ఎస్.ధోని ఫొటో విషయానికొస్తే న్యూ లుక్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.టీమిండియా మాజీ కెప్టెన్ లుక్ చూసి నెటిజనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హిమాచల్ప్రదేశ్ స్టేట్లోని సిమ్లాలో అక్కడి ట్రెడిషనల్ లుక్లో కనిపస్తున్నారు ధోని.స్థానికంగా వాడే టోపీ పెట్టుకుని, మ్యాన్లీగా దర్శనమిస్తున్నారు.
అయితే, ఆ ఫొటోలోని ధోని స్టైల్ ఇంతకు ముందరి స్టైల్ కంటే భిన్నంగా ఉంది.గతంలో ఎప్పుడూ చూడని ధోనిని సదరు చిత్తరువులో చూడొచ్చు.
సదరు ఫొటోను చూసి క్రికెట్, ధోని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.మీసాలతో ఉన్న ధోనిని చూసి మిస్టర్ కూల్ యూ ఆర్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సంగతులు ఇలా ఉంచితే ఈ ఏడాదికి సంబంధించిన ఐపీఎల్ సెకండ్ ఫేజ్ గురించి బీసీసీఐ ప్రకటన చేసింది.సెప్టెంబర్ నెల మధ్య నుంచే సీజన్ ఉండొచ్చు.
గతేడాదితో పోల్చితే బెటర్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు గాను చెన్నై సూపర్ కింగ్స్ సమాయత్తమవుతోంది.ఇందుకు పట్టుదలతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు క్రికెటర్స్.